అనపర్తి ఎర్ర కాలువ వంతెన పై ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యాపారి వాసంశెట్టి శ్రీనివాసరావు రూ. 1, 27, 860 నగదును తీసుకు వెళ్తుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ కు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా నగదుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తే వాటిని తిరిగి ఇచ్చేస్తామని అధికారులు వెల్లడించారు.