నేటితో ముగియనున్న పొగాకు కొనుగోలు

73చూసినవారు
నేటితో ముగియనున్న పొగాకు కొనుగోలు
తూ. గో జిల్లాలోని దేవరపల్లి వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు బుధవారంతో ముగుస్తున్నట్టు వేలం కేంద్రం నిర్వహణాధికారి హేమస్మిత మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్రంలో 10. 41 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయన్నారు. మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ. 400, కనిష్ట ధరరూ. 120, సగటు ధర రూ. 322. 26 పలికిందన్నారు. మొత్తం 152 రోజుల పాటు వేలం నిర్వహించామని వివరించారు.

సంబంధిత పోస్ట్