కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అధ్యక్షతన ఈనెల 19వ తేదీన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో జి. రాజ్ మనోజ్ సోమవారం తెలిపారు. ఉదయం 10. 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష ఉంటుందని ఎంపీడీవో వివరించారు.