ధవళేశ్వరంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

74చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో బుధవారం జాతీయ పతాకాలతో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ నిర్వహించారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సాయి బాబా గుడి వరకూ 1, 500 మంది విద్యార్థులు ఈ ర్యాలీ పాల్గొన్నారు. భారతమాతకి జై, స్వతంత్ర భారత్ మాతకి జై, అనే దేశభక్తి నినాదాలతో ఉత్సహంగా ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్