తూ. గో జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం గోకవరం, కోరుకొండ, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కడియం తదితర మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రూరల్ ఏరియాల్లో పొలాలను వరద ముంచెత్తింది. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాల నేపథ్యంలో విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.