కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

67చూసినవారు
కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
తిరువనంతపురం- ఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ముప్పు తప్పింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాపటపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై సోమవారం ట్రైన్(12625) వచ్చే సమయంలో ఓ వ్యక్తి బైక్ వదిలేసి పారిపోయాడు. వంద కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న రైలు బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో పూర్తిగా ధ్వంసమైంది. అయితే రాపిడి జరిగినా బైక్‌లోని పెట్రోల్‌కు మంటలు అంటుకోకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్