నిమజ్జనం సమయంలో నిబంధనలు పాటించాలి: డీఎస్పీ భవ్య కిషోర్

73చూసినవారు
నిమజ్జనం సమయంలో నిబంధనలు పాటించాలి: డీఎస్పీ భవ్య కిషోర్
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని రామపాదాలరేవులో చేసిన ఏర్పాట్లను దక్షిణ మండల డీఎస్పీ భవ్య కిషోర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ, ఇరిగేషన్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం వరద ఉధృతి ఎక్కువగా ఉందని, నిమజ్జనం సమయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు డీఎస్పీ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్