రైతుల చేతుల్లో కొండచిలువ హతం

83చూసినవారు
రైతుల చేతుల్లో కొండచిలువ హతం
జగ్గంపేట మండలం రాజపూడి శివారు కృష్ణాపురంలో పంట పొలాల్లో బుధవారం కొండచిలువ హల్చల్ చేసింది. రైతులు పొలం పనులు చేస్తుండగా కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. సుమారు 8 అడుగుల పొడవైన కొండచిలువను రైతులు ప్రాణభయంతో హతమార్చారు. కొండచిలువ 20 కేజీల వరకు బరువు ఉందని స్థానికులు తెలిపారు. అది ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్