జనసేన పార్టీలోకి చేరిన మేడిపోయిన కుటుంబీకులు
జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన మేడి బోయిన అబ్బులు, మేడిపోయిన శ్రీను తమ సుమారు 200 మంది అనుచరులతో వైసిపి నుంచి జనసేన పార్టీలో చేరారు చేబ్రోలు లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో కొణిదల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.