కాకినాడ కార్పోరేషన్ లో అవినీతి ప్రక్షాళన చేపట్టాలి

75చూసినవారు
కాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ కావడం లేదని పౌరసంక్షేమ సంఘం సభ్యులు రమణ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. గత ఆరేళ్లుగా కార్పోరేషన్ లో ఈ తీరు కొనసాగుతున్నదన్నారు. క్రింది స్థాయిలో అంతర్గత బదిలీలు కూడా జరగడం లేదన్నారు. ఈ తీరు వలన పౌర సమస్యల పరిష్కారంలో జవాబు దారీతనం లేదన్నారు.

సంబంధిత పోస్ట్