కాకినాడ రూరల్ పరిధి సూర్యారావుపేట బీచ్ వద్ద ఇండో- అమెరికన్ త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలతో శుక్రవారం కోలాహలం నెలకొంది. నావెల్ ఎంక్లేవ్లో ఇరుదేశాలు సంయుక్తంగా టైగర్ ట్రయాంఫ్- 2024 పేరుతో నిర్వహించిన విన్యాసాలు శత్రుదేశాలకు దడ పుట్టించేలా సాగినట్లు ఇండో అమెరికన్ అధికారులు వివరించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నావెల్ ప్రాంతంలో భారీ భద్రత కల్పించారు.