కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుపర్చనున్న ఐదు బ్రహ్మాస్త్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకరరావు అధ్యక్షతన మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన బూత్ లెవిల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.