ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి: సీఈఓ

57చూసినవారు
ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి: సీఈఓ
సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్‌షోలతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయా పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈఓ వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్