మండపేటలో పవన్ బహిరంగ సభకు అనూహ్యస్పందన

4018చూసినవారు
మండపేట పట్టణంలో బుధవారం జరిగిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు అనూహ్యస్పందన లభించింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చానని, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానన్నారు. భాగస్వాముల మధ్య గొడవను విద్యార్థుల భవిష్యత్తుకు ముడి పెట్టిన ఘనత వైకాపా నాయకులదన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదుగానీ గంజాయికి గిట్టుబాటు ధర వుందని, వైఎస్ జగన్ కి పొలిటికల్ హాలిడే ప్రకటించాలని, ప్రతిపక్ష హోదా కూడా రానంతగా జగన్ కు భారీ ఓటమి రుచి చూపించాలన్నారు. సహజవనరుల ద్వారా రాష్ట్రం బాగుపడాలిగాని, వ్యక్తులు కాదని, ఇసుక దోపిడీ కి అన్ని శాఖలు సహకరిస్తున్నాయని అన్నారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్, లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా జగన్ మీ ఆస్తులు దోచేయాలని చూస్తున్నాడన్నారు. వేగుళ్ళ జోగేశ్వరరావును జన సైనికులు అంతా జనసేన అభ్యర్థిగా చూడాలని, మీ భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వాన్ని ఆదరించమని విజ్ఞప్తి చేశారు. ఆయన పని చేయకపోతే నా చొక్కా పట్టుకుని నిలదీయండి నేను సమాధానం చెబుతానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్