రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్

64చూసినవారు
చిన్న సన్నకారు, కౌలు రైతులకు రూ. 5 వేలు పెన్షన్ ఇవ్వాలని, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ రైతులు బుధవారం తాళ్ళరేవు తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రాజబాబు మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే ఇవ్వాలన్నారు. గతేడాది కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 20 రోజులుగా ఆందోళనకు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్