ముమ్మిడివరం: రూ. 32. 6 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ

67చూసినవారు
ముమ్మిడివరం ఆర్య వైశ్య కల్యాణమండపంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం వాసవిమాతకు రూ. 32, 06, 000 కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం అమ్మవారికి ఆడపడుచులు సారె సమర్పించారు.

సంబంధిత పోస్ట్