అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు

68చూసినవారు
అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు
పిఠాపురం పట్టణంలోని స్థానిక జై గణేష్ దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శనివారం తెల్లవారుజామున నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా భక్తులు గణేష్ మాలధారణ వేశారు. అంతేగాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పట్టణ, పల్లెల్లో గణేషుని ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్