ఈనెల 22న నామినేషన్ వేస్తున్నా: మార్గాని భరత్

52చూసినవారు
రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలియజేశారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర అభివృద్ధి గురించి తాను మేనిఫెస్టో విడుదల చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. అనేక పదవులు అనుభవించిన ఆదిరెడ్డి కుటుంబం నగర అభివృద్ధికి ఏమీ చేయలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్