ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనంగా గుజరాత్లోని వడోదరలో ఉన్న 'లక్ష్మీ విలాస్ ప్యాలెస్' పేరొందింది. ఈ ప్యాలెస్ను 1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు నిర్మించారు. అద్భుతమైన ఈ రాజ మందిరాన్ని ఇండో-సారసెనిక్ శైలిలో దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ప్యాలెస్లో 176 లగ్జరీ గదులు, హాళ్లు, తోటలు, ఫౌంటెన్లు ఉన్నాయి. ఆ కాలంలోనే ఈ విలాస్ నిర్మాణానికి శాయాజీరావ్ గైక్వాడ్-III సుమారు రూ.27 లక్షల ఖర్చు చేశారు.