రాజమండ్రి పార్లమెంట్కు సంబంధించి దాఖలైన నామినేషన్లలో ఏడింటిని కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా తిరస్కరించినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లత తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 12 నామినేషన్లను ఆమోదించినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఆమె వెంట జిల్లా ఎన్నికల అధికారులు ఉన్నారు.