రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 2, 66, 001 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 10. 85 అడుగులకు చేరిందన్నారు. అలాగే డెల్టా కాలువలకు 12, 100 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేసినట్లు వివరించారు.