మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్

74చూసినవారు
ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా అందించాల్సి ఉందని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వైద్య పరీక్షలు, సేవల కోసం ఎటువంటి రుసుం వసూలు చేయరాదన్నారు. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. హెల్త్ కార్డు కలిగిన లబ్ధిదారులకు వైద్య సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్