కడియం: వైభవంగా దుర్గ అమ్మవారి ఊరేగింపు

66చూసినవారు
కడియంలోని మేకలదిబ్బ సెంటర్ లో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ దుర్గ అమ్మవారి ఊరేగింపు ఆదివారం వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం ప్రత్యేక వాహనంలో మొదలైంది. కేరళవాయిద్యాలు, వివిధ రకాల వేషాధారణలు అందరిని ఆకట్టుకున్నాయి. భజన, కోలాట బృందాల నృత్యాలతో గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ క్రమంలో భక్తులు అడుగడుగునా అమ్మ వారికి నీరాజనాలు పలికారు.

సంబంధిత పోస్ట్