పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై జక్కంపూడి గణేష్ నిరసన

584చూసినవారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి సభలో చేసిన వ్యాఖ్యలపై ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ శనివారం రాత్రి నిరసనకు దిగారు. కోరుకొండ మండలం గాడాల సెంటరులో తన అనుచరులతో కలిసి శిబిరం ఏర్పాటు చేసుకుని దీక్షలో కూర్చున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీక్షను విరమిస్తున్నామని, న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. కాగా ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్