లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే సీఎం జగన్కు కుళ్లు అని పవన్ కల్యాణ్ విమర్శించారు. "సినిమా టికెట్ల ధరల విషయమై జగన్తో మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్, మహేశ్ వెళితే వారిని అవమానించారు. ఇంటి బయట ఎక్కడో వాహనాలు ఆపేసి నడిపించారు. టికెట్ల ధరలకు హీరోలకి సంబంధం లేదు. చిరంజీవి అందరి తరఫున మాట్లాడితే.. ఆయన్ను అగౌరవపరిచారు." అని తూ.గో జిల్లా కోరుకొండ సభలో పవన్ మండిపడ్డారు.