విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ
రానున్న సార్వత్రిక ఎన్నికలలో విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన వైసీపీకి ప్రజలు పట్టం కట్టాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాజానగరం మండలం దివాన్ చెరువు, శ్రీరామపురం, రఘునాథపురం, భూపాలపట్నం తదితర గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేద ప్రజలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.