వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సబ్ కలెక్టర్

55చూసినవారు
వి ఆర్ పురం ఫ్లడ్స్ నోడల్ ఆఫీసర్ మరియు రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మంగళవారం శ్రీ రామగిరి, ధర్మ తాళ్లు, వడ్డిగూడెం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అలాగే శ్రీరామగిరి వరద బాధిత కుటుంబాలకు స్వయంగా కందిపప్పు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు, సీఐ, ఎస్సై, ఆర్ ఐ, ఇతర అధికారులు సర్పంచులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్