అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్డీవో

77చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని అమలాపురం నూతన రెవెన్యూ అధికారి మాధవి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు తొలుత ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆర్డీవో కొత్త మాధవి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్