రేపు రాజోలులో నామినేషన్ వేయనున్న మాజీమంత్రి

50చూసినవారు
రాజోలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేస్తున్నట్లు మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలియజేశారు. రాజోలు మండలం పరిధిలోని తాటిపాకలో ఆయన స్వగృహం వద్ద ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ. మలికిపురం వైసీపీ కార్యాలయం నుండి సోమవారం ఉదయం ర్యాలీగా బయలుదేరి, గుడిమెళ్ళంక, శివకోడు మీదుగా రాజోలు చేరుకుని తాసిల్దార్ కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్