ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జంక్షన్ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.