జపాన్కు చెందిన రెండు మిలటరీ హెలికాప్టర్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. రాత్రి సమయంలో పసిఫిక్ మహాసముద్రంపై డ్రిన్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తోరిషిమా దీవికి 270 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.