ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు

80చూసినవారు
ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారం, డబ్బులు, కరపత్రాల పంపిణీ, ఇతర వ్యవహారాల్లో ఎండీయూ ఆపరేటర్లు పాల్గొనకుండా చూడాలని సూచించారు. రేషన్ వాహనాల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన స్పందించారు. లబ్ధిదారులకు రేషన్ పంపిణీతో పాటు ఎన్నికల నియమావళి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

సంబంధిత పోస్ట్