టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. తొండింగి మండలం పిఈ చిన్నయ్యపాలెంలో మాజీ వైస్ ఎంపీపీ వడ్డీ రాంబాబు, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఓసి, బీసీ వర్గాలకు చెందిన కుటుంబాలు బుధవారం రాత్రి టిడిపిలో చేరాయి. వీరందరికీ యనమల రామకృష్ణుడు, యనమల దివ్య, యనమల కృష్ణుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.