Apr 27, 2024, 17:04 IST/వనపర్తి
వనపర్తి
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
Apr 27, 2024, 17:04 IST
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామానికి చెందిన యం. రమేష్ (40) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పదవ తరగతి మిత్ర బృందం శనివారం రమేష్ కుటుంబ సభ్యులకు రూ. 50000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మృతిచెందిన మిత్రుడు రమేష్ పిల్లల భవిష్యత్తు కొరకు ఉపయోగపడతావని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం చారి, మిత్ర బృందం పాల్గొన్నారు.