Apr 08, 2024, 16:04 IST/గద్వాల్
గద్వాల్
బాల బ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసిన డిఎస్పి
Apr 08, 2024, 16:04 IST
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పుణ్యక్షేత్రంలో సోమవారం అమావాస్య సందర్భంగా మహబూబ్ నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు ఆదిదంపతులైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు మంగళద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఇలాంటి అభిషేకాలు చాలా అరుదుగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.