రాజవొమ్మంగి మండలం - Rajavommangi Mandal

ఘోర ప్రమాదం..వ్యక్తి దుర్మరణం

ఘోర ప్రమాదం..వ్యక్తి దుర్మరణం

ఉమ్మడిత తూర్పు గోదావరిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలం శరభవరం సమీపాన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వణకరాయి గ్రామానికి చెందిన లోతా తమ్మారావు (37) మృతి చెందాడు. పొలంలో పనులు ముగించుకుని భార్యతో కలసి బైక్ పై ఇంటికి వస్తుండగా అదుపుతప్పి పడిపోయారు. వెనుక నుంచి వాహనం వేగంగా వచ్చి అతడిని ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన దంపతులను రాజవొమ్మంగికి తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం వేరు వేరు అంబులెన్స్ లలో కాకినాడ తరలించారు. మార్గ మధ్యలో తమ్మారావు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా