తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తీరుపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఈసీ ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు నిర్బంధంలోనే ఉండాలని సూచించింది. కాగా, శివకుమార్ క్యూలో నిలబడకుండా ఓటు వేయడానికి వెళ్లడంతో ఓ ఓటర్ అభ్యంతరం తెలిపారు. దాంతో అతడిపై శివకుమార్ చెయ్యి చేసుకున్న విషయం తెలిసిందే.