ఈ నెల 16వ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి 26 జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఒక్కో రోజు మూడు నియోజకవర్గాల్లో, చివరి దశలో నాలుగు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధానంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిసింది.