టీడీపీ అధినేత చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఈసీకి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఈసీ చంద్రబాబుకి నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.