కొవ్వూరులో నిర్వహించిన 'ప్రజాగళం' రోడ్ షోలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. "రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్ ఛార్జీలు పెరగవు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటాం. పేదలకు 2 సెంట్ల భూమి ఇస్తాం." అని ఆయన హామీ ఇచ్చారు.