లోక్సభ ఎన్నికల వేళ సీపీఎం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ రోజు ప్రకటించిన మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ) చట్టం(UAPA), మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA) వంటి కఠినమైన చట్టాలను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. పార్టీ తన మేనిఫెస్టోలో రాజకీయాల నుంచి మతం వేరు అనే సూత్రానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.