అమలాపురం జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సమక్షంలో పలువురు సీనియర్ నేతలు వైసీపీలో చేరారు. జనసేన పార్టీ నుంచి అమలాపురం సీనియర్ నేత, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీ.ఎం.ఆర్ శేఖర్, దుర్గాభవాని వైసీపీలో చేరారు. అనకాపల్లి జిల్లాలో జనసేన నుంచి చేరిన నేతలకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్. డీ.ఎం.ఆర్ శేఖర్ 2019లో జనసేన పార్టీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేశారు.