సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(MCMC) నుంచి ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. జిల్లా స్థాయి ప్రకటనలకు జిల్లా కమిటీ, రాష్ట్ర స్థాయి ప్రకటనలకు రాష్ట్ర కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందని తెలిపారు.