మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 326/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 35 ఓవర్లకు 207/2 పరుగులు చేసింది. బెన్ డకెట్ బజ్బాల్ గేమ్తో సెంచరీ బాదాడు. క్రీజ్లో డకెట్ (133), రూట్ (9) ఉన్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.