ఐఐటీ దిల్లీలో ఎంటెక్‌ విద్యార్థి మృతి

52చూసినవారు
ఐఐటీ దిల్లీలో ఎంటెక్‌ విద్యార్థి మృతి
దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఐఐటీలో ఇటీవల ఓ విద్యార్థి మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. శుక్రవారం క్యాంపస్‌లోని ద్రోణాచార్య వసతి గృహంలో అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్