కొప్పులవారిగూడెంలో భారీ చోరి

75చూసినవారు
పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో భారీ చోరీ జరిగింది. సీతాబాయ్ అనే మహిళ తమ కుమార్తెకు అనారోగ్యంగా ఉందని మూడు రోజుల క్రితం ఏలూరు వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కొప్పులవారిగూడెంలోని తమ ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 8 కాసుల బంగారం, ఒక కేజీ వెండి అపహరణకు గురైనట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్