రేపు నామినేషన్ వేస్తున్నా: ఎంపీ అభ్యర్థి సునీల్

81చూసినవారు
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తున్నట్లు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఉదయం 8: 30 గంటలకు ఏలూరు జూట్ మిల్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్