భారత వ్యతిరేకి మహ్మద్ మయిజ్జు మరోసారి మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 70 సీట్లను కైవసం చేసుకుంది. భారత్కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహహ్మద్ సోలికి చెందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ 15 సీట్లకే పరిమితమైంది.