దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 560.29 పాయింట్లు లాభపడి 73,648.62 వద్ద, నిఫ్టీ 189.40 పాయింట్లు లాభపడి 22,336.40 వద్ద ముగిసింది. ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. NPTC, HDFC బ్యాంక్, JSW స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ ప్రధానంగా నష్టపోయాయి.