దేశంలోని సెక్యులర్ భావాలకు పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ) వ్యతిరేకమని కేరళ సీఎం విజయన్ తెలిపారు. ఏ నాగరిక దేశమైనా మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వదని పేర్కొన్నారు. సెక్యులరిజం రక్షణ కోరుతూ సీఏఏకు వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఎటువంటి నిరసన తెలపలేదన్నారు. ఏప్రిల్ 26న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎప్ కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.